పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తాజా చిత్రం అజ్ఞాతవాసి సినిమా కోసం అటు ఇండస్ట్రీ, ఇటు ఫాన్స్ కూడా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
జనవరి 4 లేదా 5 తేదీలలో చిత్ర యూనిట్ అఫీషియల్గా ట్రైలర్ రిలీజ్ చేయాలని భావించగా, ఉన్నట్టుండి ట్రైలర్కి సంబంధించిన కొంత ఫూటేజ్ బయటకి రావడంతో యూనిట్ కూడా షాక్ అయినట్టు తెలుస్తుంది. అసలు అజ్ఞాతవాసి చిత్ర ట్రైలర్ డిసెంబర్ 25కి రావలసి ఉండగా పోస్ట్ పోన్ అయింది. జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ భారీ ప్రమోషన్స్తో అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది…
కావాలంటే ఈ వీడియో చూడండి
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అజ్ఞాతవాసి అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పండగకు కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ ఇంకా అంచనాలను పెంచింది.
ఇక పవన్ పాడిన సాంగ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా అజ్ఞాతవాసి సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ టాక్ ప్రకారం… సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టుగా పవన్ తన నటనతో విశ్వరూపం చూపించడాని తెలుస్తోంది.
ఇక ఎప్పటిలానే త్రివిక్రమ్ మాటలు మైండ్ వరకు వెళ్లి గుండెల్ని తకుతాయట. త్రివిక్రమ్ ప్రతి ఫ్రెమ్ ని చాలా వినోదాత్మకంగా తెరకక్కించడమే కాకుండా మంచి మెస్సేజ్ ఇచ్చాడని చెబుతున్నారు. మొత్తంగా సినిమాలో ఎక్కడా అశ్లీలత లేకుండా దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడని సెన్సార్ యూనిట్ ద్వారా తెలుస్తోంది. మంచి ఫ్యామిలి ఎమోషనల్ సెంటిమెంట్ తో పాటు అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉండడంతో సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికెట్ ను జారీచేసింది.
తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పవన్ అభిమానులను ఓ వార్త కలవరపెడుతోంది. అజ్ఞాతవాసి కాపీరైట్ వివాదం చుట్టుముట్టిందని, ఈ మేరకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ నుంచి నోటీసులు కూడా అందాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు.
2008లో వచ్చిన లార్గో వించ్ కు అజ్ఞాతవాసి కాపీ అని చెప్పుకుంటున్నారు. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘లార్గో వించ్’ సూపర్ హిట్ అయింది. దీంతో హిందీలో రీమేక్ చేయడానికి టీ సిరీస్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమాకు అజ్ఞాత వాసి కాపీ అనే టాక్ రావడంతో అలెర్ట్ అయిన టీ సిరీస్ సంస్థ అజ్ఞాతవాసి దర్శక నిర్మాతలకు నోటీసులు పంపిందని టాలీవుడ్ వర్గాల్లో వార్త హల్ చల్ చేస్తోంది.
అయితే ఈ వివాదంపై నిర్మాత చినబాబు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ స్పందించలేదు. అసలు ఈ వార్త ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంపై టీసిరీస్ కూడా ఎక్కడా అధికారంగా వెల్లడించలేదు. మరో వారంలో విడుదల కాబోతున్న అజ్ఞాతవాసి కి తాజావివాదం కలం కలం రేపుతోంది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇండస్ట్రీని ఈ లీకేజ్ బెడద వదలడం లేదు. బాహుబలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా లీకెజ్ బెడద వణికించింది. రిలీజ్కి ముందే ట్రైలర్ నెట్లోకి రావడంతో యూనిట్ వెంటనే అన్ని భాషలలో బాహుబలి 2 చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి ట్రైలర్లోని కొన్ని సీన్స్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.