వైసీపీలో రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అఫీషియల్ గా చేరుతున్నట్లు తెలియచేశారు రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ఇక మేడా మల్లికార్జునరెడ్డి పెద్ద ఎత్తున తన అభిమానులతో వైసీపీలో రేపు ఉదయం చేరనున్నారు.. వైయస్ ఆశయాలు ముందుకు తీసుకువెళతాను అని ఆయన తెలియచేశారు…తన ముందు ఉన్న లక్ష్యం కేవలం జగన్ ను సీఎం చేయడం అన్నారు.
అలాగే వైయస్ ఆశయాలు తీర్చాలి అంటే పేదలకు న్యాయం జరగాలి అంటే, వైయస్ జగన్ సీఎం అవ్వాలి అని ఆయన కోరారు, వైసీపీలో టికెట్ ఎవరికి ఇచ్చినా కష్టపడి పనిచేస్తామన్నారు… తెలుగుదేశంలో కొందరు తనని తొక్కాలి అని చూశారు, ఇది సహించలేకపోయాను అని, ఇక వారే పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు అని విమర్శించారు ఆయన.