హరికృష్ణ అంత్యక్రియలు ప్రారంభం అయ్యేముందు ఆయన కుటుంబ సభ్యులు అందరూ అశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు.. ఇక హరి మన ఇంటికి రారు అని ఆ మాటలను బిగ్గరగా అంటూ ఆయన కుటుంబం రోధించింది.. ఆయన ఎప్పుడూ ఎక్కడికి వెళ్లినా వెనక్కి తిరిగి, ఆ కుటుంబ సభ్యుల వైపు చూసి నవ్వేవారు.. కాని ఇప్పుడు అలాంటి చిరువనవ్వు, ఇక కానరాదు అని, ఆ తీపి గుర్తులే మనకు మిగిలాయని ఆయన చెల్లెల్లు బాధపడ్డారు.మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడె పట్టుకున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్రామ్, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో ముందు నడిచారు.
ఇటు నందమూరి కుటుంబంలో వారసులు ఎందరు ఉన్నా, హరికృష్ణ నటవారసుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి నటవారసుడిగా వచ్చింది కూడా ఆయనే..హరికృష్ణ తన 13 వ ఏటనే సినిమాల్లోకి వచ్చి తన దైన ముద్ర వేశారు.. తండ్రి పేరును రాజకీయంగా కీర్తికి తీసువెళ్లిన కుమారుడిగా ఆయనకు పేరు ఉంది… హరికృష్ణ పార్ధివదేహాన్ని జూబ్లిహిల్స్ లోని మహాప్రస్దానంలో అంత్యక్రియలకు తీసుకు వెళుతున్న సమయంలో, ఆయన భార్య జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని కన్నీరు మున్నీరుగా విలపించారు …ఇక మొదటి భార్య కూడా ఇంట్లోని ఉండి విలపీస్తూ ఉండటంతో కళ్లు తిరిగి పడిపోయారని, వెంటనే ఆమెకు వైద్యులు చికిత్స అందించారు అని తెలుస్తోంది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
హరికృష్ణ మరణ వార్తని మొదటి భార్య లక్ష్మికి తెలియకుండా జాగ్రత్త పడినా, ఆమెకు తెలియడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు…చివరగా హరికృష్ణ పార్ధీవదేహం వెళుతున్న సమయంలో ఆయన ముఖాన్ని తుడిచి, ఆయకు ఇష్టమైన విభూదిని, హరికృష్ణ ముఖానికి రాశారు ఆయన భార్య లక్ష్మీ.. ఈ సన్నివేశం ఇక్కడ ఉన్నవారిని అందరిని కలిచివేసింది.. హరికృష్ణ శివభక్తుడు ఉదయం నాలుగు గంటలకు లేచి తండ్రి వలె పూజలు చేసి బయటకు వెళ్లేవారు …అలాంటి ఆయన ఇంట్లో ఇక పూజలు చేయడానికి రారు అని ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది.. ఈ సన్నివేశాలు చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరు మున్నీరు అయ్యారు.. ఆయన మరణం జీర్ణించుకోలేనిది అని తలచుకుని బాధపడుతున్నారు.. చూశారుగా ఈవీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.